ఇదొక కొత్త అనుభవం: కోహ్లి

వెల్లింగ్టన్‌: న్యూజిలాండ్‌తో జరిగిన నాల్గో టీ20లో టీమిండియా సూపర్‌ ఓవర్‌లో విజయం సాధించింది. సూపర్‌ ఓవర్‌లో న్యూజిలాండ్‌ నిర్దేశించిన 14 పరుగుల టార్గెట్‌ను టీమిండియా బంతి మిగిలి ఉండగా ఛేదించింది. కోహ్లి ఐదో బంతికి ఫోర్‌ కొట్టి భారత్‌కు విజయాన్ని అందించాడు. గత మ్యాచ్‌లో టీమిండియా సూపర్‌ ఓవర్‌లోనే విజయం సాధించగా, రోహిత్‌ శర్మ వరుసగా రెండు సిక్సర్లు కొట్టి గెలుపును సాధించి పెట్టాడు. తాజా మ్యాచ్‌లో కేఎల్‌ రాహుల్‌-కోహ్లిలు సూపర్‌ ఓవర్‌ ఆడటానికి క్రీజ్‌లోకి వచ్చారు. తొలి రెండు బంతులకు సిక్స్‌, ఫోర్‌తో 10 పరుగులు సాధించిన రాహుల్‌.. మూడో బంతికి ఔటయ్యాడు. నాల్గో బంతికి కోహ్లి రెండు పరుగులు, ఐదో బంతికి బౌండరీ కొట్టి మ్యాచ్‌ను ముగించాడు. (ఇక్కడ చదవండి: టీమిండియా ‘డబుల్‌ సూపర్‌’)